హైదరాబాద్ : రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పిఎల్) ప్రారంభోత్సవానికి విచ్చేయవలసిందిగా రగ్బీ ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు మినిస్టర్ క్వార్టర్స్ లోరాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీహరి ఆర్ పి ఎల్ జెర్సీ ని ఆవిష్కరించారు. జిఎంఆర్ స్పోర్ట్స్ ,రగ్బీ ఇండియా తరపున 16 జూన్ 2026న హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జి.ఎం.సి. బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ప్రారంభం కానుందని తెలిపారు,సీజన్ 2లో 10 జట్లు
(6 పురుషుల ఫ్రాంచైజీలు మరియు 4 మహిళల జట్లు) పాల్గొంటాయి, ఇవి 48 మ్యాచ్లలో పోటీపడతాయని ఇందులో 19 దేశాల నుండి 70 మందికి పైగా అంతర్జాతీయ రగ్బీ సెవెన్స్ ఆటగాళ్లతో పాటు భారతదేశంలోని అగ్రశ్రేణి రగ్బీ ప్రతిభావంతులు కూడా పాల్గొంటారని తెలిపారు భారతదేశపు ప్రధాన ఫ్రాంచైజీ ఆధారిత రగ్బీ పోటీగా, ఈ లీగ్ క్రీడను అభివృద్ధి చేయడంలో భారత దేశం యొక్క విస్తృత క్రీడా, ఒలింపిక్ ఆశయాలకు మద్దతు ఇవ్వడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగన్నారు, తెలంగాణ క్రీడా శాఖ క్రీడలను ప్రోత్సహించడంలో వివిధ క్రీడాంశాలలో లీగ్ పోటీలకు సహకారం అందజేస్తుందని తెలిపారు,ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డాక్టర్ సోనీ బాలా దేవి, ఆర్ పి ఎల్ నిర్వాహకులు రగ్బీ ఇండియా ప్రెసిడెంట్ రాహుల్ బోస్ పాల్గొన్నారు.










