ఏడు కాలనీల సీవరేజ్ సమస్యల పరిష్కారానికి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జీఎంను కలిసిన శాంతి శ్రీనివాస్ రెడ్డి”.|

0
16

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ (HMWSSB) జనరల్ మేనేజర్‌ను కలిసి ముత్యంరెడ్డి నగర్, నాగిరెడ్డి కాలనీ, ఎగ్జిక్యూటివ్ కాలనీ, దినకర్ నగర్, మాధవి నగర్, అయ్యర్ బస్తీ మరియు రాజీవ్ వీకర్ సెక్షన్ ప్రాంతాల్లో కొత్త మురుగునీటి కాలువల (సీవరేజ్ లైన్లు) మంజూరు చేసి పనులు చేపట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయా కాలనీల ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సీవరేజ్ సమస్యలను జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లిన శాంతి శ్రీనివాస్ రెడ్డి, కొత్త సీవరేజ్ లైన్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసి పనులను తక్షణమే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న పలు తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల సంబంధిత అభివృద్ధి పనులపై కూడా అధికారులతో విస్తృతంగా చర్చించి వాటి అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్న శాంతి శ్రీనివాస్ రెడ్డి, కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై స్పందించిన హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జనరల్ మేనేజర్ సమర్పించిన వినతిపత్రాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

#Sidhumaroju

Alwal