మదనపల్లి కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్ణీత గడువులోపు నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్, బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్ కేసులు లేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.










