మదనపల్లెలో సంచలనం రేపిన హని వ్యవహారంలో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. తనకు ఆర్థికంగా అన్యాయం జరిగిందని ఉమాదేవి చేసిన ఆరోపణలను కుటుంబ సభ్యులు ఖండించారు. గతంలో పెద్దల సమక్షంలో కుదిరిన రాజీ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను, వివరాలను వారు సోమవారం మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఉమాదేవి చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే, ఉమాదేవి వర్గం మాత్రం భిన్న వాదనలు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో, అసలు నిజానిజాలు అధికారుల విచారణ అనంతరం తేలనున్నాయి.










