మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అర్చన, పూజలు నిర్వహించి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో మరింత విజయవంతంగా కొనసాగాలని ప్రార్థనలు చేశారు.
అనంతరం ఆల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లను పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో నందికంటి శ్రీధర్, లడ్డు, శ్రీధర్ గౌడ్తో పాటు ఆల్వాల్ సర్కిల్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజా సంక్షేమం కోసం ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ మరింత కాలం ప్రజలకు సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు.
#Sidhumaroju
Alwal










