గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు నివాసంలో గుంటూరు పార్లమెంట్ కు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం జరిగింది. ఈ భేటీకి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సర్ ప్రక్రియ, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో గుంటూరు ఎంపీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ ఎంపీ భాష్యం రామకృష్ణ, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ నసీర్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, గుంటూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.










