బీజేపీ సింగరేణి భరోసా కార్యక్రమన్ని అడ్డుకున్న పోలీసులు|

0
2

మంచిర్యాల జిల్లా :  సింగరేణి లో జరుగుతున్న అవకతవకల పై సింగరేణి భరోసా కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ OCP సందర్శనకు వెళ్తున్న ఈరోజు బీజేపీ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకట రమణ రెడ్డి , పాల్వాయి హరీశ్ బాబు , పైడి రాకేష్ రెడ్డి , శ్రీ రామారావు పటేల్ , శ్రీ ధనపాల్ సూర్యనారాయణ గుప్తా  మరియు ఎమెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డిని ఓపెన్ కాస్ట్ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యేలు మరియు ఎమెల్సీ లను అడ్డుకోవడంతో జరిగిన తీవ్ర తోపులాట జరిగిన అనంతరం పోలీసులు ఎమ్మెల్యేలను అరెస్టు చేయడంతో బీజేపీ శ్రేణులు పోలీస్ వాహనాలను అద్దుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లో చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీ నాయకులను అడ్డుకున్నారని . కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకున్న సింగరేణి సొమ్ము కక్కించే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు.