కేజీబీవీ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కామ్లే అనిల్ కుమార్|

0
0

🎤కుమురం భీం భారత్ ఆవాజ్ న్యూస్ జగదీష్

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్డె అనిల్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, భోజన నాణ్యతను పరిశీలించిన అనంతరం వారికి బెడ్ షీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థిని కష్టపడి చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కష్టపడి చదివే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని, రానున్న రోజుల్లో విద్యార్థులందరికీ  స్టూడెంట్ కిట్స్ అందజేస్తామని తెలియజేశారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులందరికీ ప్రభుత్వం తరఫున ఉచితంగా నీట్ (NEET), ఐఐటీ (IIT) కోచింగ్ ఇప్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో సీట్లు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శివచరణ్, ఎస్ఓ రైషా గారు, పాఠశాల సిబ్బంది, మండల పార్టీ అధ్యక్షులు నారాయణ, సర్పంచ్ కృష్ణాజీ, మేషుజీ మరియు ఇతర ముఖ్య నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.