అన్నమయ్య జిల్లా తంతివారిపల్లెకు చెందిన రఘుపతి (45) అనే జీవిత ఖైదీ హత్య కేసులో 2008లో యావజ్జీవ శిక్ష పడి కడప కేంద్ర కారాగారంలో ఉంటున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతన్ని రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నట్లు రిమ్స్ పోలీసులు తెలిపారు.










