కలిగిరిలో ఘనంగా “హర్ ఘర్ తిరంగా” వేడుకలు..!
దేశభక్తి నినాదాలతో మార్మోగిన కలిగిరి.. సైకిల్పై ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండల కేంద్రంలో “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిర్రావారిపాలెం నుంచి కలిగిరి ఎమ్మార్వో కార్యాలయ సెంటర్ వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు సైకిల్పై పాల్గొని ర్యాలీకి ఉత్సాహాన్ని నింపారు.
జాతీయ జెండాలతో భారీగా తరలివచ్చిన ప్రజలు, యువత, నాయకులు, కార్యకర్తలు “భారత్ మాతాకీ జై.. వందే మాతరం.. జై హింద్” అంటూ దేశభక్తి నినాదాలతో కలిగిరిని హోరెత్తించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ.. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని, దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 🇮🇳
జై హింద్..!
భారత్ మాతాకీ జై..!










