ఓదెల శ్రీ మల్లన్న స్వామి దేవస్థానంలో బుధవారం దర్శనానికి వచ్చిన భక్తులపై తేనెతీగల గుంపు ఒకసారిగా దాడి చేసింది. కరీంనగర్ నుంచి వచ్చిన కుటుంబ సభ్యులతో పాటు పలువురు భక్తులు గాయపడగా, ఆరు నెలల పుసికందు కూడా బాధితుల్లో ఉంది. మొత్తం సుమారు 15 మందిని తేనెటీగల దాడికి గురయ్యారు. సమాచారం అందుకున్న ఓదెల 108 సిబ్బంది. ఈఎంటి నరేష్, అనిల్ ఘటన స్థలానికి చేరుకొని శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.










