అమ్మవారి సేవలో భక్తజనం.. బోనాల పండుగ సందడి.|

0
9

● అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న ఎంపీ

● అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈటల రాజేందర్

● భక్తిశ్రద్ధలతో కొనసాగిన బోనాల వేడుకలు

మేడ్చల్  మల్కాజ్‌గిరి, ఆగస్టు 15: మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని బొల్లారంలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారని పేర్కొంటూ, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో బొల్లారం ప్రాంతంలో పండుగ సందడి నెలకొంది. సంప్రదాయబద్ధంగా సాగిన ఫలహారం బండి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల మాణిక్యరెడ్డి, సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి, సుధీర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal