🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు జనాకపూర్ లో గల గాంధీ స్కూల్ సమీపంలో మరియు పోచమ్మ కాలనీ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. నిలిచిన ఈ వర్షపు నీటి వల్ల పాఠశాల విద్యార్థులు, కాలనీవాసులు రాకపోకలకు నానా అవస్థలు పడుతున్నారు.
ఈ ప్రజా సమస్యపై స్థానిక కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గౌరవ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ మరియు వార్డు అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో స్పందించి ఈ సమస్యను పరిశీలించాలన్నారు. భవిష్యత్తులో ఎక్కడా వర్షపు నీరు నిలవకుండా శాశ్వత ప్రాతిపదికన పనులను వెంటనే చేపట్టాలని ఆయన అధికారులను కోరారు.










