ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కాపురం జిల్లా ఓఎస్డీ అడ్మిన్గా నవజ్యోతి మిశ్రా, రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ అడ్మిన్గా పాటిల్ దేవ్ రాజ్, పోలవరం జిల్లా ఓఎస్డీ అడ్మిన్గా మందా జావలి అల్ఫోన్స్, అమరావతి ఓఎస్డీ లాండ్ ఆర్డ్ర్గా మనోజ్ రామనాథ్ హెగ్డే, పల్నాడు జిల్లా అదనపు ఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. ఈ బదిలీలతో పోలీసు శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.






