పెద్దమండ్యం: శ్రీ పరభావనామ సంవత్సర చింతలగంగమ్మ తిరునాళ్ల సందర్భంగా, ఆలయ పంతులుగారు అమ్మవారిని రంగురంగుల పుష్పాలు, ఆభరణాలతో అద్భుతంగా అలంకరించారు. ఈ విశేష అలంకరణను రాజా రామ్ మోహన్ తవళం భరించారు. ఈ అలంకరణ భక్తులను అమితంగా ఆకట్టుకుంది. అనంతరం, అత్యంత వైభవంగా జరిగిన పల్లకి గ్రామోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










