Telangana engineers day|

0
0

తెలంగాణలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, చారిత్రక భవనాల నిర్మాణానికి మార్గదర్శకత్వం వహించిన అపర భగీరథుడు శ్రీ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.

 

🔹వారి విశిష్ట సేవలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న తెలంగాణ ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని ఇంజనీర్లందరికీ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

 

🔹“ప్రపంచాన్ని ముందుకు నడిపించే శక్తి ఇంజనీర్ల ఆలోచనల్లో ఉంటుంది. వారి ప్రతిభ, సృజనాత్మకత, కృషి వల్లే అసాధ్యంగా అనిపించిన ఎన్నో కలలు సాకారమవుతున్నాయి. ప్రతి సమస్యను ఒక అవకాశంగా మార్చే దృక్పథం, ప్రతి సవాలుకు వినూత్న పరిష్కారాలను అందించే నైపుణ్యం ఇంజనీర్ల ప్రత్యేకత. ఇంజనీర్ ఆలోచనలో భవిష్యత్తు ఉంటుంది. ప్రతి నిర్మాణంలో సమాజ ప్రగతి ఉంటుంది.” అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఒక సందేశంలో పేర్కొన్నారు.