ఈరోజు ప్రకాశం జిల్లా పెద్దాయన, మాజీ మంత్రివర్యులు విద్యాదాత స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి 96వ జయంతి సందర్బంగా ఇంచార్జి మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి , మంత్రివర్యులు డోల బాల వీరాంజనేయ స్వామి, మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లా శాసనసభ్యులు మరియు కార్పొరేషన్ల చైర్మన్లతో కలిసి ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఈరోజు ఒంగోలు నగరంలోని బాపూజీ కాంప్లెక్స్ వద్ద నున్న ఆంజనేయులు గారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్బంగా జనార్దన్ గారు మాట్లాడుతూ ప్రజానేతగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి,తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకులు మా పెద్దాయన గారు, నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించేవారు.పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేసారు అని ఈ సందర్బంగా తెలియజేసారు.ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పెద్దాయనకు నివాళులు అర్పించడం జరిగినది.










