గోదారమ్మ పట్టిసీమ ద్వారా తరలి వచ్చి కృష్ణమ్మను కలిసే పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జల హారతి కార్యక్రమంలో పాల్గొన్నాను. నదుల అనుసంధానంలో భాగంగా దశాబ్దం క్రితం నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు 450 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించి ఇక్కడి భూములను సస్యశ్యామలం చేశాం. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న నేటి రోజుల్లో కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు ఊపిరి పోశాయి. భారత సాగునీటి రంగానికి దిక్సూచిగా నిలిచిన ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కే.ఎల్. రావు గారి 124వ జయంతి సందర్భంగా సాగునీటి రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నాం. ఆయన స్ఫూర్తితో రానున్న మూడేళ్లలో పూర్తి చేసే 36 ఇరిగేషన్ ప్రాజెక్టులపై క్యాలెండర్ను ప్రకటించాము. దేవుడి దయ, ప్రజల మద్దతుతో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం.










