కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ.కడప జిల్లాపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది సోలార్ ప్లాంట్ , స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం దాల్మియా సిమెంట్ రెండవ ప్లాంట్ పనులు ప్రారంభం వలన కడప యువతకు భరోసా ఇచ్చారు.2019-24 మద్య కడప జిల్లాకు పెట్టుబడులే లేవు.కడప బిడ్డనని జగన్ కడప వాసులతో గుంపగుత్తగా ఓట్లు వేయించుకుని మోసం చేసాడు.గత పాలకులు కడపను రాజకీయంగా మాత్రమే ఉపయోగించుకున్నారు. వైసీపీ నాయకులు గట్టిగా మాట్లాడితే ఇక్కడ భయపడరు.వైసిపి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పదవిలో ఉన్న సమయంలో జమ్మలమడుగులో ఒక్క అభివృద్ది జరగలేదు.రామసుబ్బారెడ్డి డ్రామాలు పక్కనపెట్టి అభివృద్దికి సహకరించాలి.శివారెడ్డి మరణం తరువాత రామసుబ్బారెడ్డి పదవులు ఎంజాయ్ చేస్తున్నాడు అంతే.ఆయనకు జమ్మలమడుగు అభివృద్ది పట్టదు దాల్మియా వారితో స్థా నికులకు న్యాయం జరిగేలా పకడ్బందీగా నిబంధనలు ఉన్నాయి.అందులో భాగంగా ముందుగానే దాల్మియా వారు ఐదు కోట్లు ఫండ్ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్లా, బొమ్మి చెట్టు చంద్రశేఖర్, నజీముద్దీన్, తిరుమలేష్, యాల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.









