ఈ నెల 20వ తేదీన ప్రజావాణి రద్దు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్|

0
2

జూలై 18, 2026 మంచిర్యాల జిల్లా  :
ఉట్నూర్ లోని పి.ఎం.ఆర్.సి. సమావేశ మందిరంలో ఈ నెల 20వ తేదీన జిల్లా స్థాయి అధికారులతో ఉమ్మడి జిల్లా మంత్రి, రాష్ట్ర ఆబ్కారీ మద్యనిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించనున్నందున 20వ తేదీ సోమవారం రోజున జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని తెలిపారు.