*💛✌️ తరిగొండ రమేష్ గారిని పరామర్శించిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు*.
ఆదివారం రాయచోటి మున్సిపాలిటీ మాసాపేట కావలివాండ్లపల్లెలో నివాసముంటున్న తరిగొండ రమేష్ గారు ఇటీవల జరిగిన స్కూటర్ ప్రమాదంలో కాలు ఫాక్చర్ అయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు వారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను అడిగి తెలుసుకున్న సుగవాసి ప్రసాద్ బాబు గారు, రమేష్ గారు త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని మునుపటిలాగే ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు. అలాగే కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చారు.










