రైతుల వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వారి కొరకు పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.
మౌలిక వసతుల లోపం వల్ల ఒక్క రైతు కూడా నష్టపోకూడదనేదే తమ ప్రభుత్వ లక్ష్యం,ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు తీసుకువచ్చిన పంట తడిసి నష్టపోవడం అత్యంత బాధాకరం.2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేదు, ఆ ఐదేళ్లలో మార్కెట్ యార్డుకు ఎంత నిధులు కేటాయించారో, ఎన్ని గోదాములు నిర్మించారో, డ్రైనేజీ అభివృద్ధికి ఏ పనులు చేపట్టారో ప్రజలకు శ్వేతపత్రం విడుదల చెయాలి.
ఈ ఘటనకు ముందుగానే కూటమి ప్రభుత్వం మార్కెట్ యార్డు ఆధునికీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంతో పాటు గోదాముల అభివృద్ధికి రూ.32 లక్షలు, తాగునీటి వసతులకు రూ.10 లక్షలు, విద్యుద్దీకరణ పనులకు రూ.10 లక్షలు, సీసీటీవీ నిఘా వ్యవస్థ ఏర్పాటుకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి










