● ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
● క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని స్పష్టం
● తిరిగి నిర్దేశిత మతంలోకి వస్తేనే ఎస్సీ హోదాకు అవకాశం
హైదరాబాద్ జులై 27: హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) హోదా వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
భారత రాజ్యాంగం కింద అమల్లో ఉన్న Constitution (Scheduled Castes) Order, 1950 ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందినవారికే ఎస్సీ హోదా వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. ఇతర మతాల్లోకి మారిన తర్వాత ఎస్సీ హోదాను కొనసాగించలేమని స్పష్టం చేసింది.
అయితే, తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతంలోకి వచ్చి, చట్టపరమైన నిబంధనలను నెరవేర్చిన పక్షంలో ఎస్సీ హోదా పొందే అవకాశం ఉంటుందని కోర్టు పేర్కొంది.
#Sidhumaroju










