🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్ గారు పేర్కొన్నారు. ఇటీవల ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్లకు సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి సర్పంచ్ తమ గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం 4సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించగా, ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ రాబోయే ఆగస్టు 15వ తేదీ లోపు కెమెరాల అమరికను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని డీఎస్పీ వెల్లడించారు










