ఇల్లు వీడింది… ఆచూకీ కరువైంది.|

0
39

● అల్వాల్‌లో వివాహిత అదృశ్యం

● కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

మేడ్చల్ మల్కాజ్‌గిరి, జులై 28: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్యామల (25) అనే వివాహిత అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

లోతుకుంట ఇందిరానగర్ కాలనీకి చెందిన బి. వెంకటేశ్వర్ల భార్య శ్యామల ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆమె తన మొబైల్ ఫోన్‌ను ఇంట్లోనే వదిలి, కొన్ని బట్టలు, వ్యక్తిగత వస్తువులు తీసుకుని వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

బంధువులు, తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు FIR నం. 662/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గతంలో కూడా నంద్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో శ్యామల ఇలాగే అదృశ్యమైన ఘటన చోటుచేసుకోగా, అనంతరం పోలీసుల సహాయంతో గుర్తించినట్లు సమాచారం.

శ్యామల ఆచూకీ తెలిసిన వారు సమీపంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

#Sidhumaroju

Alwal