అంబేద్కర్ సెంటర్‌లో కోడిగుడ్ల రిక్షాను ఢీకొట్టిన ఇసుక లారీ తప్పిన పెను ప్రమాదం

0
1

భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో కోడిగుడ్లు సరఫరా చేస్తున్న రిక్షాను ఇసుక లారీ ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో రిక్షా నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో రిక్షా పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు పెద్ద మొత్తంలో కోడిగుడ్లు నేలపాలయ్యాయి.

అదృష్టవశాత్తూ రిక్షా డ్రైవర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే ప్రమాదం తీవ్రంగా జరిగి ఉంటే అతని కుటుంబ పరిస్థితి ఏమయ్యేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పట్టణంలో ఇసుక లారీలు అధిక వేగంతో సంచరిస్తుండటంతో వాహనదారులు, పాదచారులు భయభ్రాంతులకు గురవుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. రద్దీ ప్రాంతాల్లో వేగ నియంత్రణ చర్యలు చేపట్టి, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.