49వ డివిజన్‌లో నగర మేయర్ ఉమారాణి రమేష్ విస్తృత పర్యటన|

0
2

డివిజన్ నెం. 49లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన నగర మేయర్ శ్రీమతి కూరగాయల ఉమారాణి రమేష్ గారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీ దిలీప్ కుమార్ గారు, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి డివిజన్‌లోని పలు ప్రాంతాలను సందర్శించి పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల పరిస్థితిని పరిశీలించారు.స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకొని సంబంధిత అధికారులకు తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన పౌర సేవలు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.నగర అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, మౌలిక వసతుల మెరుగుదలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి డివిజన్‌లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మేయర్ శ్రీమతి కూరగాయల ఉమారాణి రమేష్ గారు తెలిపారు.ఈ పర్యటనలో మున్సిపల్ అధికారులు, ఇంజినీరింగ్, పారిశుధ్య విభాగాల సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.