మంచిర్యాల ఎసిసి క్వారీ రోడ్ లోని వంతన ప్రమాదకరంగా మారింది. భారీ వర్షంతో రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండగా వంతెన ఒకవైపు అప్రోచ్ రోడ్ దెబ్బతింది. బ్రిడ్జి పిల్లర్లు కూడా పటిష్టంగా లేనట్లు తెలుస్తోంది. కొత్త వంతెన నిర్మాణం పనులు చేపట్టినప్పటికీ నిలిచిపోయాయి. వంతెన కూలిపోతే ర్యాలీ ఘట్పూర్ పంచాయతీ పరిధిలోని గ్రామాలతో పాటు ఆండాలమ్మ కాలనీ ప్రజలు రాకపోకలు స్తంభిస్తాయి…










