గోదావరి – శబరి ఉగ్రరూపం: పోలవరం జిల్లాలో వరద బీభత్సం!|

0
3

గోదావరి, శబరి నదులు పోటెత్తడంతో పోలవరం జిల్లా చింతూరు మండలం వి,ఆర్,పురం మండలం కూనవరం మండలం ఎటపాక మండలం లొ వరద నీరు ముంచెత్తింది. పలు గ్రామాలు నీటమునిగి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోగా, అధికారులు సహాయక చర్యలను తీవ్రతరం చేశారు. రహదారులు జలమయం జిల్లాలోని 44 ప్రధాన రహదారులు వరద నీటిలో చిక్కుకున్నాయి. బాధిత గ్రామాలు మొత్తం 10 గ్రామాలపై వరద తీవ్ర ప్రభావం చూపింది. అందులో 9 గ్రామాలు నీట మునగగా. 1 గ్రామం చుట్టూరా వరద నీరు చేరి పూర్తిగా దిగ్బంధంలో చిక్కుకుంది. సురక్షిత ప్రాంతాలకు తరలింపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం రంగంలోకి దిగింది. 608 కుటుంబాలకు చెందిన 1,683 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. పడవలతో సహాయక చర్యలు వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు, నిత్యావసరాలు అందించేందుకు 55 దేశీ పడవలను వినియోగిస్తున్నారు. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. వరద ఉధృతి దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ తెలిపారు.

 

# Yadagiri