బొబ్బిలి మండలంలోకి ఏనుగుల గుంపు మళ్లీ వచ్చింది. రెండు వారాల క్రితం రాముడువలస, శివడవలస, కమ్మవలస, ముత్తావలస ప్రాంతాల్లో సంచరించి పంటలు నాశనం చేసిన ఈ గుంపు, తెర్లాం, మెరకముడిదాం మండలాలు వెళ్లి శుక్రవారం రాత్రి శివడవలస, రాముడువలస, పక్కి ప్రాంత పొలాల్లో సంచరించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతూ పొలాలకు వెళ్లేందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు.
#RAJESH










