ఈపీఎఫ్ పెన్షన్ నెలకు రూ.9 వేలు ఇవ్వాలని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు వి.శేషగిరిరావు డిమాండ్ చేశారు. బొబ్బిలి సీఐటీయూ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు.
నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా పెన్షన్ పెంచకపోవడంతో దేశవ్యాప్తంగా 82 లక్షల మంది పెన్షన్ దారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెన్షన్ దారుల సమస్యలపై కలెక్టరేట్ వద్ద సోమవారం జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.
#RAJESH










