10వ తరగతి టాపర్లకు నగదు బహుమతులు.|

0
1

అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం ZPHSలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం 10వ తరగతి టాపర్లకు MPTC మంచూరి జయరాములు నగదు బహుమతులు అందించారు. ప్రథమ ర్యాంకు సాధించిన వారికి రూ. 10,000, ద్వితీయ ర్యాంకు సాధించిన వారికి రూ. 5,000 చొప్పున గత మూడేళ్లుగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పూర్ణ చంద్రిక, సుమన్, శ్రీరాములు, చైర్‌పర్సన్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నగదు బహుమతులు విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు ఉద్దేశించబడ్డాయి.