పోలీసుల ప్రమాదంపై చిన్నశ్రీను దిగ్భ్రాంతి|

0
1

గాజులరేగలో రూరల్ పోలీసుల వాహనం ప్రమాదానికి గురైన ఘటనపై జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఎస్ఐ అశోక్తో పాటు పలువురు సిబ్బంది గాయపడగా, కానిస్టేబుల్ రమణ మృతి చెందడం విషాదకరమన్నారు.క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ, రమణ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గాయపడిన పోలీసులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.