ఉత్తరాంధ్రను కరువు ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కోట అప్పన్న, పట్టణ కార్యదర్శి ఎం.శ్రీనివాస్, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మునాయుడు డిమాండ్ చేశారు. బొబ్బిలి ఎమ్మార్వో కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపి ఆరొ రాంకుమార్కు వినతిపత్రం అందించారు. వర్షాభావ పరిస్థితులతో పంటలు పండే పరిస్థితి లేదని, కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.









