Madanapalle: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు, అక్కాచెల్లెమ్మలకు, ఆడపడుచులకు వైసీపీ యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ.. రక్షాబంధన్ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని అన్నారు. మహిళల భద్రత, గౌరవం, సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
అక్కాచెల్లెమ్మల ఆశీస్సులతో మదనపల్లె నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. మదనపల్లె ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.










