మైనర్లకు సిగరెట్లు.. ఇద్దరు అరెస్ట్.|

0
6

● యజమాని, ఉద్యోగి అరెస్ట్

● రూ.60 వేల విలువైన పొగాకు ఉత్పత్తులు స్వాధీనం

● 22 సార్లు నిఘా పెట్టిన ఈగిల్ ఫోర్స్

అల్వాల్, ఆగస్టు 30: మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తున్న పాన్‌షాప్ యజమాని, ఉద్యోగిని ఈగిల్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ఓల్డ్ బోయిన్‌పల్లిలో చోటుచేసుకుంది.

పోలీసుల సమాచారం మేరకు.. ఓల్డ్ బోయిన్‌పల్లిలోని లిమ్రా పాన్ మహల్‌లో 14, 17 ఏళ్ల వయసున్న ఇద్దరు మైనర్లు సిగరెట్లు కొనుగోలు చేస్తున్నట్లు ఈగిల్ ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. దీనిపై ఆధారాలు సేకరించేందుకు అధికారులు 22 సార్లు నిఘా పెట్టినట్లు తెలిపారు.

అనంతరం ఈగిల్ ఫోర్స్ బృందం, బోయిన్‌పల్లి పోలీసులు కలిసి దుకాణంపై దాడి చేశారు. దుకాణ యజమాని మహ్మద్ యూసుఫ్ ఉద్దీన్ గౌరీ (65), ఉద్యోగి మహ్మద్ రెహాన్ అలీ (19)ను అదుపులోకి తీసుకున్నారు.

దుకాణంలో తనిఖీలు నిర్వహించి మార్ల్‌బోరో, అమెరికన్, క్లాసిక్, ఎడిషన్ గోల్డ్‌ఫ్లేక్, చామ్స్ ఫ్లేక్ తదితర బ్రాండ్లకు చెందిన సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు .60 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

అదుపులోకి తీసుకున్న ఇద్దరితో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం బోయిన్‌పల్లి పోలీసులకు అప్పగించారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

#sidhumaroju

Alwal