● పలు ప్రాంతాల్లో 24 గంటలపాటు అంతరాయం
● బండ్లగూడ ఎక్స్రోడ్ వద్ద పైప్లైన్ పనులు
● నీటిని పొదుపుగా వినియోగించాలని సూచన
అల్వాల్, ఆగస్టు 30: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు 24 గంటలపాటు అంతరాయం ఏర్పడింది.
బండ్లగూడ ఎక్స్రోడ్ వద్ద ప్రధాన పైప్లైన్కు జంక్షన్ పనులు చేపట్టడంతో ఆగస్టు 29 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 30 ఉదయం 10 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా లేదా పాక్షికంగా సరఫరా నిలిచిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీరు అందింది.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బండ్లగూడ ఎక్స్రోడ్ వద్ద బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఈ పనుల మార్గంలో కృష్ణా తాగునీటి సరఫరా ప్రాజెక్టు ఫేజ్-3, రింగ్ మెయిన్-1కు చెందిన 1,500 మిల్లీమీటర్ల గ్రావిటీ మెయిన్ ఉండటంతో జంక్షన్ పనులు చేపట్టాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
ఈ అంతరాయం కారణంగా శాస్త్రిపురం, బండ్లగూడ, శంషాబాద్, అత్తాపూర్, కిస్మత్పూర్, అల్లాబండ,శంషాబాద్, అత్తాపూర్, కిస్మత్పూర్, అల్లాబండ, భోజగుట్ట, జూబ్లీహిల్స్, టాటీఖానా, గచ్చిబౌలి, మాదాపూర్, షేక్పేట్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాపై ప్రభావం పడింది.
పనులు పూర్తయిన అనంతరం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాధారణ నీటి సరఫరాను పునరుద్ధరించనున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) వెల్లడించింది.
అంతరాయం సమయంలో ప్రజలు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని అధికారులు సూచించారు.
#sidhumaroju
Alwal










