కలెక్టరేట్ ధర్నాకు ఏఎన్ఎంలు తరలిరావాలి: రంజిత్ |

0
1

మంచిర్యాల జిల్లా : సీఐటీయు జిల్లా కమిటీ సమావేశం బుధవారం రోజున బెల్లంపల్లి సీఐటీయు కార్యాలయం జిల్లా అధ్యక్షులు అబ్బోజు రమణ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్బంగా అబ్బోజు రమణ, దుంపల రంజిత్ కుమార్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ,కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆశాలు, అంగన్వాడీలకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, హమాలీ, బిల్డింగ్ వర్కర్లకు, ఐకేపీ వీఓఏలకు ఇతర కార్మికులకు వేతనాలు పెంచుతామని, సమస్యలు పరిష్కరం చేస్తామన్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నేటికీ 2 ఏండ్లు గడిచిన హామీలు అమలు చేయలేదని .

అదే విదంగా మధ్యాహ్నం భోజన పథకాన్ని స్వచ్చంద సంస్థలకు ఇవ్వద్దన్నారు. జిల్లాలోని ఎస్సి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్లకు 12 నెలలు వేతనాలు చెల్లించడం లేదన్నారు. మున్సిపాలిటీ వర్కర్లకు జీతాలు పెంచాల్సిన ప్రభుత్వం జీతాలు తగ్గించలనడం సరైంది కాదన్నారు. ఏఎన్ఎంలకు సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలి.పని భారం తగ్గించాలంటూ ఇతర సమస్యలు పరిష్కరించాలని రేపు జరిగే జిల్లా కలెక్టరేట్ ధర్నాలో జిల్లాలోని అన్ని రకాల ఏఎన్ఎంలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సమ్మక్క, ప్రకాష్ జిల్లా ఉపాధ్యక్షులు, దాగం రాజారాం జిల్లా సహాయ కార్యదర్శి, మౌలాలి, దేవదాస్ జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.