రోడ్డు పక్కన చెత్త వేయకుండా చర్యలు|

0
1

రోడ్డు పక్కన చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం జగన్నాధపురం రోడ్డు పక్కన ఉన్న చెత్తను మంగళవారం తొలగించి ట్రాక్టర్తో తరలించారు. రోడ్డు పక్కన చెత్త వేస్తే చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేయాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలను కోరారు. ఆయనతో స్వచ్ఛ భారత్ మిషన్ కో ఆర్డినేటర్ సుధాకర్ ఉన్నారు.