చిన్న శ్రీను టీడీపీలో చేరినా విజయనగరం జిల్లాలో బొత్స పట్టు సడలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దశాబ్దాలుగా ఉన్న వ్యక్తిగత సంబంధాలు, క్యాడర్తో అనుబంధం ఆయనకు ప్రధాన బలమని చెబుతున్నారు. తాజా పరిణామాలపై వెంటనే పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించడం బొత్స రాజకీయ చతురతకు నిదర్శనంగా విశ్లేషిస్తున్నారు. ఒక్క నేత పార్టీ మారినంత మాత్రాన ఆయన ప్రాబల్యానికి ముప్పులేదని పేర్కొంటున్నారు. దీనిపై మీ కామెంట్..!










