శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు.. నేడు పట్టువస్త్రాల సమర్పణ.

0
2

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు తిరుమలకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రతి ఏటా జరుగుతున్న సంప్రదాయాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దీంతో పాటు తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.

 

సీఎం పర్యటన వివరాల ప్రకారం.. 

ఈరోజు సాయంత్రం 4 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి, సాయంత్రం 5:30 గంటలకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు పయనమవుతారు. సాయంత్రం 6:20 గంటలకు తిరుమలలోని శ్రీ గాయత్రీ నిలయానికి చేరుకుని, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు.