మదనపల్లె: ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదేశాల మేరకు 32వ వార్డు అధ్యక్షులు మండిపల్లి (జేసీబీ) మధుసూదన్ రెడ్డి వినాయక విగ్రహాల నిమజ్జనానికి క్రేన్ ఏర్పాటు చేసి భక్తులకు సేవలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక నిమజ్జన కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు క్రేన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు.










