ఈ నెల 19వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరగనున్న జీవో 296, 388 పట్టాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పంపిణీ

0
1

ఈ నెల 19వ తేదీన ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరగనున్న జీవో 296, 388 పట్టాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పంపిణీ కార్యక్రమంపై ప్రభుత్వ విప్ గణబాబు ములగాడ తహశీల్దార్ కార్యాలయంలో ఎంఆర్వో మరియు జోనల్ కమిషనర్‌లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులందరికీ విఆర్ఓ ల ద్వారా సకాలంలో ఆహ్వాన పత్రికలు అందజేయాలని, సభా ప్రాంగణానికి సులభంగా చేరుకునేలా తగినన్ని ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డాక్యుమెంట్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయడంతో పాటు, సభా వేదిక వద్ద లబ్ధిదారుల సౌకర్యార్థం బోజన ఏర్పాట్లపై సమీక్షించారు