ఏపీలో కొలువుల జాతర: ఎస్సై, కానిస్టేబుల్ సహా 2,050 పోస్టుల భర్తీకి ప్రకటన.

0
2

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పోలీసు, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో కలిపి మొత్తం 2,050 పోస్టుల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (SLPRB) బుధవారం వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నియామక ప్రక్రియను చేపడుతున్నట్లు బోర్డు వెల్లడించింది.

 

విడుదలైన నోటిఫికేషన్ల ప్రకారం, మొత్తం 378 సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్సై), 1,569 కానిస్టేబుల్, ఇతర అనుబంధ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్సై విభాగంలో సివిల్, ఏఆర్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాలు ఉండగా, కానిస్టేబుల్ కేటగిరీలో సివిల్, ఏఆర్, ఫైర్‌మెన్, జైలు వార్డర్లు, కమ్యూనికేషన్స్, డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 43 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు.