రెడ్డివారిపల్లెలో రూ.57,000 ధర పలికిన వినాయకుని లడ్డు.

0
1

అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం రెడ్డివారిపల్లెలో గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని శోభాయాత్రగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిపిన వేలంలో వినాయకుని లడ్డును బుర్రా శ్రీనివాసులు రికార్డు స్థాయిలో రూ. 57, 000 కు దక్కించుకోగా, అమ్మవారి గాజులను భారతి రూ. 4, 000 కు సొంతం చేసుకున్నారు. ఊరి భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర కన్నులపండువగా జరిగింది.