Home South Zone Andhra Pradesh ఆంధ్ర రైతులకు బిగ్ అప్‌డేట్… రూ.7,000 నేరుగా ఖాతాల్లోకి |

ఆంధ్ర రైతులకు బిగ్ అప్‌డేట్… రూ.7,000 నేరుగా ఖాతాల్లోకి |

0

రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 19న ‘అన్నదాత సుఖీభవ’ పథకం రెండో విడత నిధులను విడుదల చేయడానికి సిద్ధమైంది. కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు రూ.5,000 సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

అదే రోజు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ పథకం కింద రూ.2,000 విడుదల చేస్తోంది. దీంతో ప్రతి రైతుకు మొత్తం రూ.7,000 చేరనున్నాయి. ఈ విడత ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

NO COMMENTS

Exit mobile version