పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో గురువారం ఉదయం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రజలు చలికి తట్టుకోలేక చలిమంటలు వేసుకుని సేద తీరుతున్నారు. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడంతో ఉదయం పూట ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
ఉదయం 11 గంటల వరకు కూడా చలి, మంచు తగ్గడం లేదు. మారుతున్న వాతావరణం పట్ల అప్రమత్తంగా ఉంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు# కొత్తూరు మురళి.
