Home South Zone Andhra Pradesh అనకాపల్లిలో పట్టాదార్ పాస్‌పుస్తకాలు పంపిణీ |

అనకాపల్లిలో పట్టాదార్ పాస్‌పుస్తకాలు పంపిణీ |

0

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో పాల్గొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్

జగన్ ప్రభుత్వ పాపాల కారణంగానే ఇప్పటికీ భూముల వివరాల్లో తప్పులు

ప్రజల ఆస్తులను దొచుకునేందుకు జగన్ రెడ్డి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను తెచ్చారు

ప్రజల భూములను కబళించేందుకే తప్పుల తడకగా రీ సర్వే నిర్వహించారు

అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేశాం

గ్రామ సభలు నిర్వహించి రీ సర్వేపై 2.5 లక్షలకు పైగా వచ్చిన అర్జీలను పరిష్కరించాం

ఇంకా ఏమైనా ఒకటి, రెండు తప్పులంటే వెంటనే పరిష్కరిస్తాం.

రీ సర్వేలో తలెత్తిన సమస్యలను పరిష్కరించే అధికారాలను ఎమ్మార్వోలకు బదిలీ చేశాం.

రైతులు తప్పులను చూపిస్తే సరిచేసి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తాం

వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ మాత్రమే కాక సూపర్ 18 కార్యక్రమాలు చేశాం.

జగన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పుల భారం మోపితే.. కేవలం ఉత్తరాంధ్రకే మేం రూ. 10 లక్షల పెట్టుబడులు తెచ్చాం.

విశాఖ సిటీ ఐటి హాబ్ గా మారుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా రూ. 26 లక్షల పెట్టుబుడులతో 22 లక్షల మందికి ఉపాధి రానుంది.

Exit mobile version