తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో, టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.
నిన్న ఒక్కరోజే 61,632 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ద్వారా ₹3.28 కోట్ల ఆదాయం సమకూరింది. రద్దీ దృష్ట్యా భక్తులు తమకు కేటాయించిన సమయానికే క్యూలోకి రావాలని టీటీడీ సూచించింది.
