మదనపల్లె చిన్నారి రిషిక హత్యపై బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి రాజకీయ అండదండలు ఉన్నాయని ఆరోపిస్తూ, రాజకీయాలకు తావులేకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కాగా, నిందితుడు కులవర్ధన్ బుధవారం ఉదయం చెరువులో శవమై లభ్యమయ్యాడు. పోలీసుల వేట ముమ్మరం కావడంతో భయపడి అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్పీ ధ్రువీకరించారు. బాధితులకు న్యాయం జరిగిందని స్థానికులు బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు.
